దారుణ హత్యకు గురైన మహిళా కాంగ్రెస్ నేత....కర్ణాటక లో

కాంగ్రెస్ పార్టీ మహిళా నేత దారుణ హత్యకు గురయ్యారు.కర్ణాటక రాష్ట్రం లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

గతంలో జేడీఎస్ పార్టీ అధ్యక్షురాలి గా భాద్యతలు నిర్వహించి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ పార్టీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీ లో చేరిన మహిళా నేత రేష్మా పడకనూర్ దారుణంగా హత్య గావించబడ్డారు.గురువారం తెలిసిన వ్యక్తి తో కలిసి తన కారులోనే బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు.

దీనితో ఆమె అసలు ఎక్కడకి వెళ్ళింది? అసలు ఏమైంది అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.అయితే శుక్రవారం కొల్హాపూర్ సమీపంలో ఉన్న కృష్ణ నది తీరంలో ఆమె శవమై తేలడం తీవ్ర కలకలం సృష్టించింది.

ఆమె ను ఎవరో దుండగులు దారుణంగా హత్య చేసి శవాన్ని నది తీరంలో పడేసి పారిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.జేడీఎస్ పార్టీ అధ్యక్షురాలి గా ఉన్న ఆమె 2013 లో ఎమ్మెల్యే సీటు కోసం ఆశించగా ఆమెకు నిరాశే మిగిలింది.

Advertisement

దీనితో జేడీఎస్ కు గుడ్ బై చెప్పిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఆమె,ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న ఈ సమయంలో దారుణంగా హత్యకు గురికావడం తో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలు ఆమె ఎవరికీ బయటకి వెళ్ళింది.ఎక్కడకి వెళ్ళింది అన్న విషయాలు మాత్రం తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు