రైతుల పట్ల కాంగ్రెస్ ది కపట ప్రేమ..: మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈసీకి ఫిర్యాదుతో రైతుల పట్ల కాంగ్రెస్ కపట ప్రేమ బట్టబయలు అయిందని విమర్శించారు.

రైతుబంధును ఆపేయాలనడం కాంగ్రెస్ దుర్మార్గానికి పరాకాష్ట అని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ రద్దుల పార్టీ అన్న ఆయన గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలదీయండని సూచించారు.

కేసీఆర్ తెచ్చిన పథకాలు ఆపేస్తే దేశంలో ఎక్కడా పంచాయతీ ఉండదని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి పథకాలు లేవన్నారు.

కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను ప్రజలు గమనించాలని కోరారు.ఈ క్రమంలోనే ప్రజల కోసం పని చేసే పార్టీని గుర్తించాలని తెలిపారు.

Advertisement
పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?

తాజా వార్తలు