కాంగ్రెస్ నీచ రాజకీయం ఎన్నికల్లో లాభం కోసమేనా?: కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS Former Minister KTR ) ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయమే ముఖ్యమని తేలిపోయిందని తెలిపారు.

మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం( Coffer Dam ) కట్టి మరమ్మత్తులు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) డిమాండ్ చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.రిపోర్టు వచ్చాక కాఫర్ డ్యాం కడతామని ఎల్ అండ్ టీ ముందుకొచ్చిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) మాత్రం చిల్లర రాజకీయం చేస్తోందని విమర్శించారు.కేసీఆర్ ను బద్నాం చేయాలనే అజెండాతో కాఫర్ డ్యాం కట్టకుండా రైతులను నిండా ముంచాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ నీచ రాజకీయం ఎన్నికల్లో లాభం కోసమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు.

Advertisement
వైరల్ వీడియో : ఈ తల్లి గొరిల్లాకు ఆస్కార్ ఇవ్వాల్సిందే..

తాజా వార్తలు