ఏపీలో రిజిస్ట్రేషన్ పారదర్శకత కోసం కమిటీ ఏర్పాటైంది.ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రజత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్, గుల్జార్లు ఉన్నారు.
రాష్ట్రంలో ఆదాయాన్నిచ్చే శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకత, సులభతర విధానాలను అమలు చేస్తూనే ఆదాయ పెంపుపై సూచనలు ఇవ్వాలంటూ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు.
దీనిపై రెండు వారాల్లో నివేదిక అందించాలని సూచించారు.