నేడు సీఎం వైఎస్‌ జగన్‌ బాపట్ల జిల్లా నిజాంపట్నం పర్యటన

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా (YSR- Matsyakara Bharosa )లబ్ధిదారులకు నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌( YS Jagan Mohan Reddy ) వరుసగా ఐదో ఏడాది.

వైఎస్సార్‌ మత్స్య కార భరోసా రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్‌ 15– జూన్‌ 14 కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం.దీనితో పాటు ఓఎన్‌జీసీ సంస్థ పైప్‌ లైన్‌ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23,458 మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న దాదాపు రూ.108 కోట్లతో కలిపి.మొత్తం రూ.231 కోట్లను నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌./br>నేడు అందిస్తున్న సాయంతో కలిపి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి.వచ్చిననాటి నుండి ఇప్పటివరకు కేవలం వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం క్రింద మాత్రమే అందించిన మొత్తం సాయం రూ.538 కోట్లు, ఏటా రూ.10 వేల చొప్పున ఈ ఒక్క పథకం ద్వారానే ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ.50 వేల లబ్ధి.ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిజాంపట్నం చేరుకుంటారు.ఆ తర్వాత అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని వెఎస్సార్‌ మత్స్యకార భరోసా లబ్ధిదారులకు నగదు జమ చేయనున్న సీఎం, అనంతరం అక్కడినుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

తాజా వార్తలు