మంత్రి మ‌ల్లారెడ్డిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. స‌డెన్‌గా ఏమైంది..?

గ‌త మూడు, నాలుగు రోజులుగా రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇద్ద‌రి పేర్లు హైలెట్ అవుతున్నాయి.వారే రేవంత్ రెడ్డి, మంత్రి మ‌ల్లారెడ్డి.

సీఎం కేసీఆర్ ద‌త్త‌త గ్రామంలో దీక్ష సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి మంత్రి మ‌ల్లారెడ్డి మీద సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.కాగా దీనికి కౌంట‌ర్ గా అదే రోజు మంత్రి మ‌ల్లారెడ్డి కూడా మీడియా స‌మావేశంలో రేవంత్‌పై బాగానే రెచ్చిపోయారు.

గ‌తంలో ఎన్న‌డూ లేన‌న్ని తిట్ల పురాణాన్ని ఎత్తుకుని ఓ రేంజ్‌లో స‌వాల్ విసిరారు.మీడియా ముందు ఏ మంత్రి చేయ‌ని ప‌ని చేస్తూ సంచ‌ల‌నం రేపారు.

ఏకంగా మీడియా ముందే తొడ‌లు కొడుతూ డైలాగులు చెబుతూ తాను మంత్రి ప‌ద‌వికి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తానంటూ సంచ‌ల‌నం రేపారు.ఇక రేవంత్ కూడా త‌న టీపీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌వికి అలాగే ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి త‌న‌మీద పోటీ చేయాల‌ని స‌వాల్ విసిరారు.

Advertisement

అయితే దీనికి కౌంట‌ర్‌గా ఎంపీ రేవంత్ మ‌రో సారి మీడియా ముందుకు వ‌చ్చి మంత్రి భూములు క‌బ్జా చేశారంటూ కొన్ని ప‌త్రాలు విడుద‌ల చేశారు.అలాగే మ‌ల్లారెడ్డి కాలేజీల్లో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయంటూ మ‌రికొన్ని ఆధారాలు చూపించారు.

ఇక మంత్రి ఈ ఆరోప‌ణ‌ల‌పై క్లారిటీ ఇచ్చేందుకు నిన్న మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చారు.అయితే ఇక్క‌డే అస‌లు ట్విస్టు దాగుంది.అదేంటంటే రెండు రోజుల క్రితం ఓ రేంజ్‌లో రెచ్చిపోయి మాట్లాడిన మ‌ల్లారెడ్డి నిన్న ఒక్క సారిగా ఆవేద‌న‌తో మాట్లాడారు.

తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, రేవంతే కావాల‌ని త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్నారంటూ తీవ్ర ఆవేద‌న‌తో మాట్లాడారు.అయితే రెండు రోజుల్లోనే మంత్రి ఇంత మార్పు ఎలా అంటూ మీడియా మిత్రులు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఏదేమైనా మరోసారి రేవంత్ మీడియా ముందుకు వ‌చ్చి త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయ‌కుండా ఉండాల‌ని మ‌ల్లారెడ్డి ఇలా త‌గ్గి మాట్లాడాడంటూ చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు