కనిపించే దేవత.. కనిపెంచిన అమ్మకు శుభాకాంక్షలు.. అమ్మకు ప్రేమతో చిరంజీవి పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.

చిరంజీవి విశ్వంభర ( visvambara )సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

ఈరోజు చిరంజీవి అమ్మ పుట్టినరోజు కాగా "కనిపించే దేవత.కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు" అని చిరంజీవి పోస్ట్ లో పేర్కొన్నారు.

చిరంజీవి అభిమానులు సైతం "మాకు ఇంత గొప్ప హీరోని, అనుక్షణం ఫ్యాన్స్ గురించి తపించే అన్నయ్యను ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాం అంజనమ్మా" అని చిరంజీవి వెల్లడించారు.చిరంజీవి తాజాగా పద్మవిభూషణ్ అవార్డును( Padma Vibhushan Award ) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట( Mallidi Vasishta ) డైరెక్షన్ లో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Advertisement

చిరంజీవికి జోడీగా త్రిష ఈ సినిమాలో నటిస్తుండగా విశ్వంభర ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండటం గమనార్హం.పరిమిత బడ్జెట్ తో బింబిసార సినిమాతో మ్యాజిక్ చేసిన మల్లిడి వశిష్ట ఎక్కువ మొత్తం బడ్జెట్ కేటాయించిన నేపథ్యంలో ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.మల్లిడి వశిష్ట ఈ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేస్తానని నమ్ముతున్నారు.

సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా విజువల్ ఎఫెక్స్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.విశ్వంభర సినిమా ఒక భాగంగా తెరకెక్కుతుందా లేక రెండు భాగాలుగా తెరకెక్కుతుందా అనే ప్రశ్నలకు సైతం జవాబు దొరకాల్సి ఉంది.చిరంజీవి ఈ సినిమా మినహా మరే సినిమాను ప్రకటించలేదు.

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు