మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ పనికి అభిమానులు ఫిదా... ఏం చేసాడంటే?

మెగాస్టార్ చిరంజీవి పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.

ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి అంచలంచెలుగా ఎదుగుతూ సుప్రీం స్టార్ నుండి మెగాస్టార్ గా కోట్లాది మంది ప్రేక్షకులకు ఆరాధ్య హీరోగా మారాడు.

సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ప్రభంజనం కొనసాగుతున్న తరుణంలో నటుడిగా సత్తా చాటడమంటే ఆశామాషీ వ్యవహారం కాదు.అయితే డ్యాన్స్ లలో, నటనలో తనకంటూ ప్రత్యేక శైలిని సృష్టించుకుంటున్నాడు.

అయితే మెగాస్టార్ గా ఎన్నో అద్భుత శిఖరాలను అధిరోహించినా మనిషి ఎంత గొప్పగా ఎదిగాడో, మనసు కూడా అంతే గొప్పది.ఈ విషయం చాలా సార్లు మనకు రుజువయింది.

కరోనా లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులకు నిత్యవసర సరుకులను అందజేశారు.ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నా అండగా నిలిచే గొప్ప మనసున్న మెగాస్టార్ తాజాగా ప్రముఖ యాంకర్ టీఎన్ఆర్ కుటుంబానికి అండగా నిలిచాడు.

Advertisement

కరోనా బారిన పడి ప్రముఖ యాంకర్ టీఎన్ఆర్ మరణించిన విషయం తెలిసిందే.అయితే టీఎన్ఆర్ మరణ వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి టీఎన్ఆర్ సతీమణిని ఫోన్ లో పరామర్శించి ధైర్యం చెప్పి, తక్షణ సాయం క్రింద లక్ష రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించారు.

ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు