చిరంజీవి.. సాయి ధరమ్‌ తేజ్ కాంబో మూవీ వార్తలపై స్పష్టత

మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కబోతున్న ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా లో కీలక పాత్ర ను సాయి ధరం తేజ్ చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ప్రధాన మీడియా సంస్థలు కూడా ఈ వార్త ను ప్రముఖం గా ప్రచురించడం తో మెగా అభిమానులంతా ఆసక్తి గా ఎదురు చూశారు.

మొదట ఆ పాత్రను వరుణ్ తేజ్ చేస్తాడు అంటూ వార్తలు వచ్చాయి.కానీ ఆ పాత్రకు సాయి ధరం తేజ్ అయితే బాగుంటుందనే ఉద్దేశం తో చిరంజీవి మేనల్లుడు ని ఆ సినిమా కు తీసుకున్నాడు అని పుకార్లు షికార్లు చేశాయి.

త్వరలోనే చిరంజీవి మరియు సాయి ధరం తేజ్ తండ్రీ కొడుకులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అని మెగా అభిమానులంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్న సమయం లో మెగా కాంపౌండ్ నుంచి ఆ వార్త లకు క్లారిటీ వచ్చింది.

మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఒక వ్యక్తి స్పందిస్తూ చిరంజీవి మరియు సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా వార్తలు కేవలం పుకార్లు మాత్రమే.ఇప్పటి వరకు వీరిద్దరి కాంబో సినిమా గురించి ఎలాంటి కథను ఎవరు తీసుకు రాలేదని క్లారిటీ ఇచ్చారు.ఇద్దరు కలిసి నటించబోతున్నారని వార్తలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

కానీ ఇప్పుడు క్లారిటీ రావడం తో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన ఏర్పాట్లు జరగడం లేదని, భవిష్యత్తు లో ఏమైనా చూడాలంటూ చెప్పుకొచ్చారు.

చిరంజీవి సినిమా ల విషయానికి వస్తే ఆచార్య ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఆ తర్వాత గాడ్ ఫాదర్ ఆ తర్వాత భోళా శంకర్‌ సినిమా లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి చేస్తున్న వాల్తేరు వీరన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ సమాచారం అందుతోంది.ఇన్ని సినిమాల మధ్యలో చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం అందులో కీలక పాత్ర సాయి ధరమ్‌ తేజ్ అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా పుకార్లు మాత్రమే అని క్లారిటీ వచ్చేసింది.

అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం
Advertisement

తాజా వార్తలు