చింతపల్లి ఎస్ఐ ,రైటర్ పై సస్పెన్షన్ వేటు

నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చింతపల్లి మండల ఎస్ఐ రామాంజనేయులు,రైటర్ యాదగిరిలపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో వారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఓ వ్యక్తిపై ఉన్న కేసుల విషయంలో ముడుపులు తీసుకోవడంతో పాటు,ఇతర ఆరోపణలు రుజువు కావడంతో వీరిపై సస్పెన్షన్ వేటు పడ్డట్టు తెలుస్తోంది.

కాగా ఎస్ఐ రామాంజనేయులు కొద్ది నెలల క్రితమే అధికారపార్టీ నేతల పైరవీతో చింతపల్లి ఎస్సైగా వచ్చారని,ఈయన గతంలో వేరే జిల్లాలో పని చేసిన సమయంలో కూడా సస్పెన్షన్ కు గురైనట్లు సమాచారం.

ఎస్సీ,ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్...!

Latest Nalgonda News