కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో గందరగోళం

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది.ఎయిర్ పోర్టుకు ఆలస్యంగా వచ్చారని 18 మంది ప్రయాణికులు ఎయిరిండియా సిబ్బంది వెనక్కి పంపించి వేశారని తెలుస్తోంది.

దీంతో విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.అయితే గన్నవరం నుంచి కువైట్ వెళ్లాల్సి ఉంది.

ఈ ఎయిరిండియా విమానంలో 85 మంది ప్రయాణించాల్సి ఉండగా 67 మంది మాత్రమే వెళ్లినట్లు సమాచారం.ముందు మధ్యాహ్నం 1.10 నిమిషాలకు ఉండగా ఇప్పుడు 9.55 నిమిషాలకు టైమ్ మారిందని సిబ్బంది చెబుతున్నారని ప్రయాణికులు మండిపడ్డారు.అదేవిధంగా సమయం మార్పుపై తమకు ఎలాంటి సమాచారం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు