కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మ అవార్డులు ప్రకటించింది.మొత్తం 128 మందికి అవార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.
నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.ఈ క్రమంలో 107 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
తెలంగాణకు 4 మరియు ఏపీకి మూడు పద్మశ్రీలు లభించాయి.తెలంగాణ రాష్ట్రానికి చెందిన కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లకి పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి.
దర్శనం మొగిలయ్య కి పద్మశ్రీ అవార్డు లభించింది.
ఇక ఇదే రీతిలో తెలంగాణకు చెందిన రామచంద్రయ్యకు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది.
ఇక తెలంగాణకు చెందిన పద్మజా రెడ్డి కి పద్మశ్రీ అవార్డు లభించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రవచనాలు చెప్పే గరికపాటి నరసింహారావు కు పద్మశ్రీ అవార్డు లభించింది.
గోసవీడు షేక్ హాసన్ కి కూడా అవార్డు లభించింది.ఏపీకి చెందిన సుంకర ఆదినారాయణకు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కు పద్మభూషణ్ అవార్డు కేంద్రం ప్రకటించింది.గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కి పద్మభూషణ్ మరికొంత మంది ప్రముఖులకు పద్మ అవార్డులు కేంద్రం ప్రకటించడం జరిగింది.