కెనడా : వాంకోవర్‌లోని కాన్సులేట్ కార్యాలయం వద్ద పోస్టర్ కలకలం .. భారత వ్యతిరేక రాతలు

కెనడాలో( Canada ) ఖలిస్తాన్ మద్ధతుదారుల ఆగడాలు నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.హిందూ దేవాలయాలు, విగ్రహాలు, మహాత్మా గాంధీ విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయి.

అంతేకాదు.భారత దౌత్య కార్యాలయాలపైనా( Indian Consulates ) దాడులు చేస్తూ, దౌత్య సిబ్బందిని బెదిరిస్తున్నారు.

ఖలిస్తాన్ వేర్పాటువాదులను నియంత్రించాలని భారత ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా కెనడా పట్టించుకున్న దాఖలాలు లేవు.ఇవి అంతిమంగా ఇరుదేశాల సంబంధాలను ప్రభావితం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజాగా వాంకోవర్‌లోని( Vancouver ) భారత కాన్సులేట్ కార్యాలయ భవనం వద్ద భారత వ్యతిరేక పోస్టర్‌ను ప్రదర్శించారు గుర్తు తెలియని వ్యక్తులు.ఇక్కడి భద్రతా వైఫల్యంపై భారత్ మరోసారి భగ్గుమంది.

Advertisement

ఈ వారం ప్రారంభంలో మెట్రో వాంకోవర్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలలో , ముఖ్యంగా సర్రే పట్టణంలో కనిపించిన పోస్టర్‌ల మాదిరిగానే తాజా పోస్టర్ వుంది.ఈ పోస్టర్లలో కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తల ఫోటోలు, పేర్ల కింద ‘వాంటెడ్’’ అనే పదాన్ని ఉపయోగించారు ఆగంతకులు.

ఒట్టావాలోని( Ottawa ) భారత హైకమీషనర్, వాంకోవర్, టొరంటోలోని కాన్సుల్ జనరల్స్ పేర్లను వారు ప్రస్తావించారు.మంగళవారం ఉదయం కాన్సులేట్ హౌసింగ్ భవనం ప్రవేశ ద్వారం వద్ద పోస్టర్‌ను గుర్తించిన అధికారులు దానిని తొలగించారు.

దుండగులు దానిని తెల్లవారుజామున అక్కడ వుంచినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

ఈ వ్యవహారంలో పరిష్కార చర్యల కోసం స్థానిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత దౌత్యాధికారి ఒకరు చెప్పారు.రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) దౌత్యపరమైన భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తుండగా.వాంకోవర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇక్కడ బాధ్యత వహిస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆగస్ట్ 15న కెనడాలోని భారతీయ మిషన్లను ముట్టడిస్తామని ఇప్పటికే ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద గ్రూపులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.దానికి ఎంతో సమయం లేకపోగా.ఇప్పటికీ ఇలాంటి పోస్టర్లు కనిపిస్తూ వుండటంతో భారత దౌత్య కార్యాలయాలు, దౌత్య సిబ్బంది భద్రతపై న్యూఢిల్లీ ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

కాగా.జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌‌( Hardeep Singh Nijjar ) దారుణహత్యకు గురయ్యాడు.గురునానక్ సింగ్ గురుద్వారా సాహిబ్ పార్కింగ్ ప్లేస్‌లో అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

దీని వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందని ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు.ఆ తర్వాతి నుంచే ఎస్ఎఫ్‌జే బెదిరింపులు పెరిగాయి.భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ, టొరంటో, వాంకోవర్‌లలోని భారత కాన్సుల్ జనరల్స్‌‌ను లక్ష్యంగా చేసుకుని ‘‘కిల్ ఇండియా’’ పోస్టర్లు వెలిశాయి.

తాజా వార్తలు