కరోనా టీకా వేసుకున్న వారికి బంపర్‌ ఆఫర్‌.. !

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ప్రజలందరు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే బలవంతంగా అయినా ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారట.

కాగా ఇప్పటికి కొందరికి కరోనా టీకా పట్ల ఉన్న భయం తొలగలేదు.ఈ నేపధ్యంలో ఉత్తర ఢిల్లీ మేయర్‌ జై ప్రకాశ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.

కొవిడ్‌ టీకా వేసుకుంటే ఆస్తిపన్నులో రీబేటు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.కాగా చాలా మంది జనం కోవిడ్ టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదు.

ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు నిర్ణయించుకున్న ప్రభుత్వం రాయితీ కోసం రెసిడెన్షియల్‌ హౌస్‌ యజమాని, అర్హత గల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలుపుతున్నారు.ఈ మేరకు నివాస గృహాల యజమానులు, పన్ను చెల్లింపుదారులకు ఆస్తిపన్నులో అదనంగా 5శాతం రిబేటు ఇస్తామని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కాపీలు అందజేయాలని అధికారులు తెలుపుతున్నారు.కాగా ఈ అవకాశం జూన్‌ 30 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.

Advertisement
నా భార్యను క్షమించమని అడిగాను.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు