ఆహ్వానం లేకపోయినా ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ ఎంపీ..!

బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు ఆహ్వానం లేకపోయినా ఆత్మీయ సమ్మేళనానికి హాజరు అయ్యారు.

ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మంచుకొండలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లిన ఎంపీ నామా కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సమ్మేళనాలకు తనను ఎవరూ పిలవాల్సిన అవసరం లేదన్నారు.

కేసీఆర్ ను గద్దె దింపే దమ్ము ఎవరికీ లేదని చెప్పారు.ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

దేశంలోని అనేక రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు