సీఎం జగన్ పై బ్రదర్ అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!!

గత కొద్ది రోజుల నుండి వైఎస్ షర్మిల భర్త ప్రముఖ క్రైస్తవ ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ ఏపీ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో కూడా సమావేశమయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో షర్మిల స్థాపించిన తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలను తెరవెనుక నుండి అనిల్ కుమార్ నడిపిస్తున్నట్లు మొన్నటిదాక వార్తలు వచ్చాయి.అయితే ఈ సమయంలో అనిల్ కుమార్ ఏపీలో బీసీ అదేవిధంగా మైనార్టీ సంఘాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించడం.

ప్రత్యేకంగా భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా విజయవాడలో వివిధ సంఘాల నేతలతో భేటీ అయిన అనంతరం.

బ్రదర్ అనిల్ కుమార్ ని మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయడం జరిగింది.ఏపీలో పార్టీకి సంబంధించి ప్రశ్నలు వేయటంతో.

Advertisement

అటువంటిదేమీ లేదని తెలిపారు.ఇదే సమయంలో సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ కోసం పనిచేసిన క్రైస్తవులు.ఇప్పుడు తీవ్ర ఆవేదనతో ఉన్నారని పేర్కొన్నారు.

ఇటీవల తమతో భేటీ అయిన కొందరు క్రైస్తవులు ఇదే మాట తెలియజేశారు అని చెప్పుకొచ్చారు.ఏపీ వేదికగా కొత్త పార్టీ పెడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని.ఉండవల్లి ని కలిసిన అంశం వేరేదని స్పష్టం చేశారు.

ఒకవేళ ఏపీలో పార్టీ పెట్టే ఉద్దేశ్యం ఉంటే కచ్చితంగా వివరాలు వెల్లడిస్తానని అనిల్ చెప్పుకొచ్చారు.దీంతో అనిల్ కుమార్ సీఎం జగన్ పై చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement
" autoplay>

తాజా వార్తలు