బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కార్యకర్తలు

సూర్యాపేట జిల్లా:జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై జిల్లా కేంద్రంలోని 8 వ వార్డు కుసుమవారిగూడెంకు చెందిన బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు గోగుల రామకృష్ణ( Gogula Ramakrishna )తో పాటు పలువురు బీజేపీ నాయకులు,కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ( Guntakandla Jagadish Reddy )సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

 Bjp Workers Who Joined Brs-TeluguStop.com

వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్ఎస్ చేరిన వారిలో గోగుల వెంకన్న,సైదులు, ఉపేందర్,సతీష్,రాము, రవి,వెంకటేశ్వర్లు, రాంబాబు,శ్రీను తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో జూలకంటి నాగేందర్ రెడ్డి( Julakanti Nagender Reddy ),8 వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కడారి సతీష్ యాదవ్, గంగ లింగారెడ్డి,కొండేటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube