బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కార్యకర్తలు

సూర్యాపేట జిల్లా:జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై జిల్లా కేంద్రంలోని 8 వ వార్డు కుసుమవారిగూడెంకు చెందిన బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు గోగుల రామకృష్ణ( Gogula Ramakrishna )తో పాటు పలువురు బీజేపీ నాయకులు,కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ( Guntakandla Jagadish Reddy )సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.బీఆర్ఎస్ చేరిన వారిలో గోగుల వెంకన్న,సైదులు, ఉపేందర్,సతీష్,రాము, రవి,వెంకటేశ్వర్లు, రాంబాబు,శ్రీను తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో జూలకంటి నాగేందర్ రెడ్డి( Julakanti Nagender Reddy ),8 వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కడారి సతీష్ యాదవ్, గంగ లింగారెడ్డి,కొండేటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

అక్కడ యాసిడ్ పోస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు.. ఎస్తర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!