చంద్రబాబు అవినీతిలో బీజేపీకి వాటా ఉంది.. మంత్రి కారుమూరి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని మంత్రి కారుమూరి అన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు ప్రకటన చేస్తే బాగుండేదన్న ఆయన విశాఖ రైల్వేజోన్ ఊసే ఎత్తలేదని విమర్శించారు.

అమిత్ షా విశాఖ మెట్రో రైల్ గురించి మాట్లాడలేదని మంత్రి కారుమూరి మండిపడ్డారు.మోదీ, అమిత్ షాలు చంద్రబాబును కించపరిచినా సిగ్గులేదా అని ప్రశ్నించారు.

అమరావతి పెద్ద స్కాం అని మాట్లాడింది బీజేపీ కాదా అని నిలదీశారు.అమరావతిలో జరిగిన భూ దోపిడీ అమిత్ షా కు తెలియదా అని ఫైర్ అయిన మంత్రి విశాఖలో భూ దోపిడీ ఎక్కడ జరిగిందో ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు.

చంద్రబాబు చేసిన అవినీతిలో బీజేపీకి వాటా ఉందన్నారు.కేంద్రం ఇచ్చే నిధులు ప్రజలవేనని, వాటిని ప్రజలకే ఖర్చు పెడుతున్నామని స్పష్టం చేశారు.

Advertisement
చైనా: యూట్యూబర్‌కు షాకింగ్ అనుభవం.. మంటలు షూట్ చేసిన రోబో డాగ్‌..?

Latest Latest News - Telugu News