కాంగ్రెస్ పార్టీలా బీజేపీకి అహంకారం లేదు..: మోదీ

మహారాష్ట్ర, రాజస్థాన్ ఎన్డీఏ కూటమి ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తోందని ఆరోపించారు.

వారసత్వ రాజకీయాలతో ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ ప్రధానులు కాలేకపోయారని మోదీ తెలిపారు.ప్రతిపక్షంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నా వారసత్వ రాజకీయాల కారణంగా వారిని ప్రోత్సహించలేదని చెప్పారు.

అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలు తమకు ముఖ్యమని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీలా బీజేపీకి అహంకారం లేదన్నారు.

ఈ క్రమంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అవినీతి రాజకీయాలు దేశానికే ప్రమాదకరమన్న మోదీ అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు భయపడలేదని తెలిపారు.

Advertisement

రాజస్థాన్ భవిష్యత్ ను మార్చేందుకు బీజేపీ అధికారంలోకి రావాలని వెల్లడించారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా 
Advertisement

తాజా వార్తలు