బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవినే.. మొట్టమొదటిసారి లేడి విన్నర్!

బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటివరకు బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లలో కొందరు మాత్రమే మంచి అవకాశాలు అందుకున్నారు.

మరికొందరు మాత్రం తమకున్న గుర్తింపునే కోల్పోయారు.అయినా కూడా ఈ షోకి మంచి క్రేజ్ ఉంది.

ఇప్పటికే ఐదు సీజన్ పూర్తికాగా ఓటీటీ ద్వారా కూడా నాన్-స్టాప్ బిగ్ బాస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ షో ఫిబ్రవరి 26న ప్రారంభం కాగా.

మొత్తం 17 మంది కంటెస్టెంట్ లు హౌస్ లో అడుగుపెట్టారు.ఇక మొత్తానికి ఈ షో బాగా కొనసాగగా ఇప్పటికీ పదిమంది కంటెస్టెంట్ లు హౌస్ నుంచి వెళ్లిపోగా.

Advertisement

ప్రస్తుతం ఏడుగురు మాత్రమే ఉన్నారు.ఇక అందులో అనిల్, బిందు మాధవి, అఖిల్, బాబా భాస్కర్, మిత్ర, శివ, అరియానా లు ఉన్నారు.

ఇక ఇంతకుముందు ప్రసారమైన సీజన్ లలో ఐదుగురు మాత్రమే ఫినాలే లో ఉండేవాళ్ళు.ఈసారి ఏడుగురు కంటెస్టెంట్ లతో ఫినాలే ఏర్పాటు చేశారు.

ఇప్పుడు ఈ ఏడుగురిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు అనేది బాగా ఆసక్తిగా మారింది.ఇప్పటికే ఈ సీజన్ లో నటి బిందు మాధవి ప్రేక్షకులందరికీ ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచింది.

దాంతో ప్రతి ఒక్కరు ఆమెనే గెలుస్తుందని మొదటినుంచి అనుకున్నారు.ఈమెకు పోటీగా ఎంతమంది వచ్చినా కూడా కచ్చితంగా తానే గెలుస్తుంది అని అంటున్నారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

ఇదిలా ఉంటే తాజాగా కూడా బిగ్ బాస్ విన్నర్ కచ్చితంగా బిందుమాధవి నిలుస్తుందని ప్రచారాలు చేస్తున్నారు.పైగా అఖిల్ ను వెనక్కు నెట్టి ఆడపులి బిందు టైటిల్ ను ఎగరేసుకుపోయింది అంటూ హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

Advertisement

తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా అమ్మాయి గెలిచింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.బిగ్ బాస్ అంటే ఫిజికల్ టాస్క్ కాదని వ్యక్తిత్వాన్ని కూడా సంబంధించిన విషయం అని గతంలో టైటిల్ విన్నర్ అభిజిత్ అన్న మాటలను ఇప్పుడు బిందు మాధవికి ఉపయోగిస్తున్నారు ప్రేక్షకులు, అభిమానులు.దీంతో ఇప్పటికే సోషల్ మీడియాలో ఇప్పుడున్న ఏడుగురు లో టాప్ ఫైవ్ లో ఉన్న వారి పేర్లు ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

బిందు మాధవి విన్నర్, అఖిల్ రన్నర్ అని.ఇక మూడో స్థానంలో మిత్రశర్మ, నాలుగవ స్థానంలో యాంకర్ శివ, ఐదవ స్థానంలో అరియానా పేర్లు బాగా వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని ప్రస్తుతం మాత్రం ఈ విషయం నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.

నెటిజన్లు కూడా బిందుమాధవి కే సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.ఒకవేళ సోషల్ మీడియాలో చెప్పిందే నిజం అయితే మాత్రం బిందుమాధవి అభిమానుల సంతోషాలలో అవధులే లేవు.

ఇక అసలు విషయం తెలియాలి అంటే నాగార్జున చెప్పేదాకా ఎదురుచూడక తప్పదు.

తాజా వార్తలు