తనని కష్ట కాలంలో ఆదుకున్న వ్యక్తినే పెళ్లాడబోతున్న తెలుగు యాంకర్...

తెలుగు బుల్లితెరలో ఒక పక్క షోలు, పలు రకాల ఈవెంట్లలో హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరోపక్క చిత్రాల్లో అడపాదడపా పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నటువంటి యాంకర్ భానుశ్రీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

అయితే ఈ అమ్మడు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటేస్తెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే తాజాగా యాంకర్ భాను శ్రీ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి నటువంటి కొన్ని అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో తాను సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో చాలా కష్టాలు పడ్డానని, అంతేగాక ఒకానొక సమయంలో ఉండడానికి చోటు కూడా లేకుండా ఇబ్బందిపడ్డానని చెప్పుకొచ్చింది.అలాంటి సమయంలో తన స్నేహితుడి ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడని ఆ వ్యక్తి తనని కష్ట సమయంలో ఆదుకోవడమే గాకుండా, జీవితాంతం ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాడనే నమ్మకాన్ని కూడా తనలో కలిగించాడని తెలిపింది.

అలాగే తాను కష్టాల్లో ఉన్న సమయంలో కృంగి పోకుండా ధైర్యం చెబుతూ ముందుకు సాగిపోవాలని ప్రోత్సహించాడని, అలాగే కష్ట కాలంలో అండగా నిలబడేటువంటి వ్యక్తి తన పక్కన ఉంటే ఎంతటి కష్టాన్ని అయినా మరిచిపోయి ధైర్యంగా ముందుకు సాగవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.అంతేగాక తాను సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనకి కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే భయంగా ఉండేదని అందువల్ల ఇతరులతో ఎక్కువగా కలిసి మెలసి మెలగలేక పోయేదానని అని తెలిపింది.

Advertisement

తనని కష్టకాలంలో ఆదుకున్నటువంటి అతడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది.అయితే ఈ అమ్మడు తెలుగులో కుమారి 21ఎఫ్, కాటమరాయుడు, ఇద్దరి మధ్య, బాహుబలి, తదితర చిత్రాల్లో నటించింది.

అలాగే అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యే "జాబిలమ్మ" అనే ధారావాహికలో కూడా నటించింది.ఇటీవల కాలంలో ఈ అమ్మడు నటించిన  "ఏడు చేపల కథ" అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

కానీ ఈ చిత్రంలో భాను శ్రీ నటనకు మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.ప్రస్తుతం ఈ అమ్మడు పలు టాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు