సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తాజాగా ట్విట్టర్లో చేసిన ట్వీట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
ఇంతకు ఆయన ట్విట్టర్లో ఏమన్నాడంటే.
కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో విజయవాడ నగర ప్రజలు ఎంత అదృష్టవంతులో నాకిప్పుడు అర్థం అయ్యింది.అమ్మో చిన్న పొరపాటు జరిగి ఉంటే ఘోర ప్రమాదం జరిగిపోయేది అంటూ నమస్కారం ఈమోజీని పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం పీవీపీ మరియు బండ్ల గణేష్ల మద్య వివాదం కొనసాగుతుంది.వారిద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఆర్థిక పరమైన విషయాల కారణంగా బండ్ల గణేష్పై తాజాగా పీవీపీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.పీవీపీ తనపై కేసు పెట్టిన నేపథ్యంలో బండ్ల గణేష్ పై ట్వీట్ చేశాడు.
మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుండి పీవీపీ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెల్సిందే.పీవీపీ ఓడిపోవడం వల్లే విజయవాడ ప్రజలు అదృష్టవంతులు అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.
మొత్తానికి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.ఆయన పీవీపీ పేరు ఎత్తకుండానే విజయవాడ ప్రజలు లక్కీ అంటూ చెప్పడంతో ఆయన చెప్పదల్చుకుంది అర్థం అయ్యిందని అంతా అంటున్నారు.
ఈ ట్వీట్పై పీవీపీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.మరో వైపు పోలీసులు బండ్ల గణేష్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy