కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్,( Ponnam Prabhakar ) బీజేపీ ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay ) మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా మంత్రి పొన్నంకు బండి సంజయ్ సవాల్ విసిరారు.
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని తెలిపారు.నిరంతరం ప్రజల కోసం కొట్లాడే తనపై వంద కేసులు ఉన్నాయన్నారు.
ఈ క్రమంలోనే ఇతర నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశారా అని ప్రశ్నించారు.
ఇప్పటికే కేటీఆర్( KTR ) తీరుతో బీఆర్ఎస్( BRS ) మునిగిపోయిందన్న బండి సంజయ్ అదే తరహాలో మంత్రి పొన్నం తీరుతో కాంగ్రెస్ కూడా త్వరలో మునిగిపోవడం ఖాయమని విమర్శించారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ తెలిపారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైతే మంత్రి పొన్నం రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు.