అయ్యా బాలయ్యా ! ఇదేం దబిడి దిబిడి ..?

నందమూరి హీరో బాలకృష్ణ స్టయిలే వేరు .అయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడా .

ఎలా మాట్లాడతాడో తెలియదు.కాకపోతే ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా మాత్రం నిలుస్తుంటాడు.

తాజాగా.నందమూరి నటసింహం బాలయ్య తన అన్న కూతురు సుహాసిని నామినేషన్ సందర్భంగా చేసిన ప్రసంగం ఇప్పుడు మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది.

సోషల్ మీడియా లో అయితే కామెడీ గా ఈ ప్రసంగం ట్రోల్ అవుతోంది.

Advertisement

తన సోదరుడి మరణం గురించి బాలయ్య మాట్లాడుతూ.ఆయన మరణంతో అభిమానులంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు అని సెలవిచ్చాడు.అది అసలు ఇక్కడ వాడాల్సిన పదమే కాదు.

ఏదో వర్డ్ బాగుందని యూజ్ చేసినట్టుగా ఉన్నాడు.హరికృష్ణ మరణంతో అభిమానులు సంభ్రమాశ్చర్యలకు గురయ్యారట.

అంటే స్వీట్ సర్ ప్రైజ్ కు గురయ్యారు అనేది బాలయ్య ఉద్దేశం! చూడబోతే అల్లుడు లోకేష్ ను మించి కామెడీ పంచేలా కనిపిస్తున్నాడు బాలయ్య బాబు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు