తండ్రీకొడుకులుగా కనిపించనున్న బాలయ్య.. అభిమానులు ఆదరిస్తారా?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇటీవలే అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఆ సినిమా మంచి విజయం సాధించడంతో అదే ఊపుతో వరుసగా సినిమాలకు సిగ్నల్ ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ కి సిగ్నల్ ఇచ్చేసారు బాలయ్య.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలుపెట్టారు.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.ఇటీవలే ఫిబ్రవరి 18న సిరిసిల్ల జిల్లా లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభించారు చిత్రబృందం.

ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగే కథగా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

ఈ సినిమాలో బాలయ్య తండ్రీ కొడుకులుగా అనగా ద్విపాత్రాభినయంలో నటించ బోతున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలో కథ అంతా కూడా నీటి సమస్య చుట్టూ తిరుగుతోందని సమాచారం.

ఇక ఇందులో బాలయ్య రెండు పాత్రల మధ్య ఉన్న వేరియేషన్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తోంది అని సమాచారం.ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే ఇందులో విలన్ పాత్రలో కన్నడ హీరో దునియా విజయ్ నటించ బోతున్నాడు అని సమాచారం.అదే విధంగా ఈ సినిమాలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక కీలక పాత్రలో నటించనుందట.ఈ సినిమా టైటిల్ కోసం వీర సింహా రెడ్డి అన్న టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాకపోతే బాలయ్య బాబు ఇటీవలే అఖండ సినిమాతో మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు