గణపతి లడ్డును లక్షల్లో వేలం పాడి సొంతం చేసుకున్న బేబీ ప్రొడ్యూసర్!

మెగా అభిమానిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెగా హీరోలకు మేనేజర్ గారు, కంటెంట్ రైటర్ గా, పీఆర్వోగా పనిచేసే అనంతరం నిర్మాతగా మారినటువంటి వారిలో ఎస్కేఎన్( SKN )ఒకరు.

తాజాగా ఈయన బేబీ సినిమా ( Baby Movie ) కు నిర్మాతగా వ్యవహరించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఒక చిన్న సినిమాగా విడుదలైనటువంటి ఈ చిత్రం సంచలనమైనటువంటి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాతో నిర్మాతగా ఎస్కేఎన్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక ఈ సినిమా ద్వారా నిర్మాతకు కోట్లలో లాభాలను కూడా అందుకున్నారని చెప్పాలి.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్( Allu Arjun ) మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) వంటి వారు కూడా ప్రత్యేకంగా చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఘనంగా వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇలా నిర్మాతగా ఎస్కేఎన్ మరో మెట్టు పైకి ఎక్కారు.ఇక ఈ సినిమా తర్వాత తన నిర్మాణంలో మరో అద్భుతమైన కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఈయన ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా గణేష్ ఉత్సవాలు వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ( Allu Aravind ) నిర్మాణ సంస్థ అయినటువంటి గీత ఆర్ట్స్ బ్యానర్ లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.వినాయకుడి నిమజ్జనం సందర్భంగా వినాయకుడి లడ్డూ( Laddu ) ను వేలం వేశారు.

ఇక ఈ లడ్డు వేలం పాటలో నిర్మాత ఎస్కేఎన్ రెండు లక్షలకు వేలంపాడి ఈ లడ్డూని సొంతం చేసుకున్నారు.ఇక ఈ విషయాన్ని ఈయన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.ఈ ఏడాది గీత ఆర్ట్స్ గణేష్ లడ్డూని వేలం పాటలో సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

అందులోనూ అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా ఈ లడ్డు తీసుకోవడం మరింత సంతోషాన్ని ఇస్తుంది అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ యాక్షన్ షురూ చేసేది అప్పుడేనట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు