ఏరు దాటే దాకా ఓడ మల్లన్న వేరు దాకా బోడి మల్లన్న అన్నట్లుగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మంత్రి హరీష్ రావు విమర్శించారు.
తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది .రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ లో చేరారు.ఆయనకు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈనెల 19 ఉమ్మడి కృష్ణాజిల్లాలో టిడిపి యువ నేత నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు.
సిలికా ద్వారా వైసీపీ నాయకులు కోట్లు గడిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
జర్నలిజం రంగంలో 47 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్టు సిహెచ్ఎంవి కృష్ణారావు ఈరోజు మృతి చెందారు.ఏడాది కాలంగా క్యాన్సర్ తో ఆయన పోరాడుతున్నారు.
భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ , కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం ఆయన చేసిన కృషి అని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు.ఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరును ప్రధాన మంత్రుల నియోజకవర్గంగా మార్చడం పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.గురువారం ఉదయం మండపేటలో పర్యటించిన చంద్రబాబు ఈ సందర్భంగా సర్పంచ్ ల సమావేశం నిర్వహించారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక లయంలో డిగ్రీ, పలు డిప్లమో సర్టిఫికెట్ కోర్సులు చేరేందుకు గడువును సెప్టెంబర్ 5 వరకు పెంచినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బిజెపి రాష్ట్ర కమిటీ లో మార్పు, చేర్పులపై కసరత్తు నిర్వహించారు.
టిడిపి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.సౌమ్య ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.జిల్లాలో మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలతో సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చి నిరసన తెలపడానికి బయలుదేరిన సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై శాసనమండలి చైర్మన్ గుత్తా ఉపేందర్ రెడ్డి విమర్శలు చేశారు.కోమటిరెడ్డి సన్యాసం తీసుకో ఇదే సరైన సమయం అంటూ గుత్తా సెటైర్లు వేశారు.
మళ్లీ తాను కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు.
తాడిపత్రి బాగు కోసం 100 కోట్లు మంజూరు చేస్తే తాను చైర్మన్ గా రాజీనామా చేస్తానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.
తిరుమలలో మరికొద్ది రోజులపాటు ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని సీసీఎఫ్ నాగేశ్వరావు తెలిపారు.
తుంగభద్ర కాలువలకు నవంబర్ 30 వరకు నీటిని వదలాలని తుంగభద్ర నీటి పరదాలలో సలహా సమితి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
నటుడు ఉపేంద్ర తనపై దాఖలైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలంటే హైకోర్టులో వేసిన పిటీషన్ పై విచారణ వాయిదా పడింది.
తిరుమల నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది.గతంలో బాలికపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత చిక్కింది.
వచ్చే నెల 1 నుంచి ఖమ్మంలో అగ్ని వీర్ సైన్యం నియామక ర్యాలీ జరగనుంది.
తిరుమలలో కాలినడకన వెళ్లే భక్తులకు గొడ్డలో, కోడి కత్తో ఇస్తారేమో అంటూ వైసిపి రెవెల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు సెటైర్లు వేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy