చిరంజీవి గరికిపాటి మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో చిరుని స్వయంగా కలిసి క్షమాపణలు చెప్తానని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన క్షమాపణలు ఏవీ తమకు అవసరం లేదు అంటూ చిరంజీవి సోదరుడు నాగబాబు వ్యాఖ్యానించారు.
మునుగోడు బీజేపీ అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
ఆక్వా రైతుల ఫిర్యాదులపై జగన్ సీరియస్ అయ్యారు.వాటి పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులు , సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.
కర్ణాటక లో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు రేసులో ఉన్న మల్లికార్జున్ ఖర్గే నేడు గాంధీ భవన్ లో సమావేశం అయ్యారు.
ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.ఈ సందర్భంగా నిపుణుల అభిప్రాయాలను ఐక్య కార్యాచరణ కమిటీ సేకరించనుంది.
వికేంద్రీకరణ పోరాటం కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడింది.నేడు తొలి సమావేశం నిర్వహించి కర్యచరణ ప్రకటించనున్నారు.
రైల్వే ట్రాక్ మరమ్మత్తుల కారణంగా నేటి నుంచి పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు.విజయవాడ - బిట్రుగుంట, విజయవాడ - ఒంగోలు , విజయవాడ - గూడూరు మధ్య నడిచే రైళ్లు రద్దు చేశారు.
నేడు ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.
తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీ వారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది.
గుంటూరు జిల్లా పెద కాకాని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య పర్యటించనున్నారు.
నేడు బిజెపి పదాధికారులు జిల్లా అధ్యక్షులు ఇన్చార్జీలతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై మాజీ ఎంపీ, బిజేపి నేత వివేక్ వెంకటస్వామి విమర్శలు చేశారు.కోల్ మైన్స్ బ్లాక్ గురించి కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వివేక్ మండిపడ్డారు,
హైదరాబాద్ లోని దుర్గం చెరువు లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ కి అరుదైన గుర్తింపు లభించింది.ఇండియన్ చాఫ్టర్ ఆఫ్ అమెరికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంక్రీట్ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన కేటగిరీ లో రెండో స్థానంలో నిలిచింది.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న అంతర్ఘాం మండలం పెద్ధం పేట లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.
రెండో రోజు ఏడి అధికారులు విచారణకు అనంతపురం టిడిపి కీలక నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు.
ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కు డాక్టర్ సీ నారాయణరెడ్డి పురస్కారం లభించింది.
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.వరుసగా సెలవలు రావడం తో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి క్యూ కడుతున్నారు.
యాదగిరి గుట్ట ఆలయంలో భక్తుల తలనీలాల మొక్కు టికెట్ ధరను రూ.20 నుంచి రూ.50 కి పెంచారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,420 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,760.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy