ఏపీ సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.
సహకార సంఘ భవనాన్ని నెల్లూరు జగన్ ప్రారంభించి అనంతరం రైతు సదస్సులో పాల్గొంటారు.
నేడు కాకినాడలో కేంద్ర బృందం పర్యటిస్తోంది.
తిరుమలలో ఈనెల 12వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది.
గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో వైయస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను మంత్రి విడుదల రజనీ ప్రారంభించనున్నారు.
గత ప్రభుత్వాలు మాదిరిగా కాకుండా విద్యారంగంపైనే తాను ఎక్కువ ఫోకస్ పెట్టానని ఏపీ సీఎం జగన్ అన్నారు.
స్పీకర్ చాంబర్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఏసి సమావేశం జరిగింది.
ఓ ఆర్ ఆర్ పై సోలార్ గ్రూప్ సైకిల్ ట్రాక్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం పై ఈడి విచారణ కొనసాగుతోంది .కోకాపేటలోని రామచంద్ర పిళ్లే ఇంట్లో ఇంకా ఈ డి సోదాలు జరుగుతూనే ఉన్నాయి.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం జరిగింది.నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అడ్డుకునే అరెస్ట్ చేశారు.
స్పీకర్ ఒక మన మనిషి లాగా వ్యవహరిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.
రేపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది.దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ మండల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ కేఆర్ నందన్ పదవీ కాలాన్ని మరో రెండు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఆదివారం జరిగిన రాత పరీక్ష కి విడుదల చేశారు.దీనిపై అభ్యంతరాలను ఈనెల 7వ తేదీ ఉదయం 11 గంటల లోగా ఆన్లైన్ లో సమర్పించాలని సంస్థ డైరెక్టర్ తెలిపారు.
ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి సెప్టెంబర్ 9న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ వేదిక గా 11 న చారిత్రాత్మక ఉత్సవానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
బిగ్బాస్ రియాల్టీ షో కాదని , అదో దరిద్రపు బూతు షో అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని సీఎం కేసీఆర్ విస్మరించారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా ఇంధన శాఖ కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది
కేంద్రం సబ్సిడీపై రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నందున ప్రతి షాపులోనూ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టాల్సిందేనని కేంద్ర సహకార ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బి ఎల్ వర్మ ఆదేశించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy