ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు బాధ్యులైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై హత్య కేసు నమోదు చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ను చీపురుతో కొట్టాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్ లో గతంతో పోలిస్తే పేదరికం బాగా తగ్గిందని ప్రపంచ బ్యాంక్ పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్ వెల్లడించింది.
కొవిడ్ మరణాల సంఖ్య విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రం పై విమర్శలు చేశారు.కోవిడ్ మరణాల విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో తేడా ఉంది అంటూ న్యూ యార్క్ టైమ్స్ కథనాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ కామెంట్ చేశారు.
ఉన్నత స్థానాల్లో ఉంటున్న వారిని విమర్శించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు గుంటనక్క లను ఉపయోగిస్తున్నాడని విజయసాయి రెడ్డి విమర్శించారు.
ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి చోటు చేసుకుంటున్న కాంగ్రెస్ బిజెపి నేతలకు కళ్ళు కనిపించడం లేదని టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీనికి ఆహ్వానం ఉంటేనే రావాలి అని కేటీఆర్ సూచించారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక సైకో అని కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన రద్దయింది.
తిరుమల శ్రీవారి మెట్ల మార్గాన్ని మళ్లీ తెరిచారు.మే 1 నుంచి ఈ మెట్ల మార్గంను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
మాజీమంత్రి టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పై పోలీసు కేసు నమోదయ్యింది. పోలీసులను దుర్భాషలాడటం పై ఈ కేసు నమోదు అయ్యింది.
ఏపీలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ టీడీపీ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆర్టిసి బస్సు లో ప్రయాణికులకు మజ్జిగ, డబ్బులు పంచి పెట్టి వినూత్న నిరసన తెలియజేశారు.
ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహిస్తోంది.
ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెరుగుదల పై మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నిరసన తెలియజేశారు.
మరణాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు తాడేపల్లి రైతులు పోస్ట్ కార్డులు రాశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం లో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
టిఎస్పిఎస్సి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై నకిలీ సర్టిఫికెట్ లతో మోసాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నారు.తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందాలని చూస్తే అభ్యర్థులను ఐదేళ్లపాటు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
రాష్ట్రంలో మరో పది లక్షల కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నామని తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
వరుస సెలవులతో యాదాద్రి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరిగాయని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy