ఇకపై అలా కూర్చోలేనంటూ అనుష్క ట్వీట్.. అభిమానులు ఫిదా!

బాలీవుడ్ బ్యూటీ, ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో యాక్టీవ్ గా ఉంటారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన గురించి, భర్త కోహ్లీ గురించి ఎంతో ఆసక్తికరమైన పోస్ట్ లు చేస్తూ వచ్చే అనుష్క శర్మ నిండు గర్భిణీ అయినా కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.అంతగా అనుష్క శర్మ ఏం రాసింది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.అనుష్క శర్మ తన పాత ఫోటోను షేర్ చేశారు.

ఫొటో కింద ఓ అద్భుతమైన క్యాప్షన్ కూడా రాశారు.అప్పట్లో కాఫీ తాగుతూ తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ.

నేను మళ్ళీ ఎప్పుడు ఇలా కూర్చోని తింటానో.ఇప్పుడు తినగలను కానీ ఇలా అయితే కూర్చోలేను అంటూ ఆమె పోస్ట్ షేర్ చేశారు.

Advertisement

అంతే ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు వారికీ శుభాకాంక్షలు చెప్తూ పోస్ట్ షేర్ చేశారు.కాగా గతంలోనూ ఇలాంటి ఫోటోలను కొన్ని షేర్ చేశారు అనుష్క శర్మ.

ఇటీవలే తలకిందులుగా యోగ చేస్తున్న అనుష్కకు సాయంగా నిలిచినా కోహ్లీ ఫోటోను షేర్ చేశారు.ఆ ఫోటోను చూసి నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు.

నిండు గర్భిణిగా కూడా ఎంత యాక్టీవ్ ఉంది అనుష్క అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే అనుష్క శర్మ ఇటీవల ఓ యాడ్ లో కూడా నటించారు.

ప్రెగ్నె్న్సీ కిట్ ప్రెగా న్యూస్ కోసం అనుష్క శర్మ యాడ్ చేశారు.ఆ యాడ్ కూడా ప్రస్తుతం వైరల్ గానే మారింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు