బాలీవుడ్ దర్శకులని ఆకర్షించిన జగన్ పొలిటికల్ స్టొరీ

ఏపీ రాజకీయాలలోనే కాకుండా దేశ రాజకీయాలలో కూడా వైసీపీ అధినేత జగన్ ఓ సంచలనం అని చెప్పాలి.

పదేళ్ళ పోరాటం తర్వాత జగన్ తన రాజకీయ ప్రస్తానంలో ముఖ్యమంత్రి కావాలనే తన కల నెరవేర్చుకున్నాడు.

జాతీయ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కత్తి దూసి, ఏకంగా ఏడాదికిపైగా జైలులో ఉన్న కూడా ఎ మాత్రం చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో, సంకల్పంతో ముందుకి ప్రజలలోకి వచ్చి మొత్తానికి ప్రజల మద్దతు పొంది ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు జగన్ రాజకీయ ప్రస్తానం చాలా మంది దర్శక నిర్మాతలని భాగా ఆకర్షించింది.

దీంతో ఇప్పటికే జగన్ స్టొరీతో యాత్ర 2 ని తెరకెక్కిస్తా అని దర్శకుడు మహి వి రాఘవ తెలియజేసారు.ఇదిలా ఉంటే ఇప్పుడు జగన్ స్పూర్తివంతమైన కథ బాలీవుడ్ దర్శకులని కూడా ఆకర్షించింది అని చెప్పాలి.

జాతీయ ప‌త్రికలో జగన్ గురించి వచ్చిన కథనం చదివిన బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఆసక్తికరమైన వాఖ్యలు చేసాడు.మంచి కథ దొరికింది, దీన్ని సినిమాగా మార్చేందుకు వేచి చూస్తున్నానంటూ ట్వీట్ చేసాడు.

Advertisement

తన ట్వీట్ కి ఇంగ్లీష్ పేపర్ లో పబ్లిష్ అయిన కథనం కూడా జోడించారు.దీంతో ఇప్పుడు జగన్ స్టొరీ బాలీవుడ్ లో తెరకెక్కబోతుంది అంటూ సంబరపడిపోతున్నారు.

మరో వైపు తాజాగా స్టార్ హీరో సూర్య జగన్ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ కూడా వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు