మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేందుకు చరణ్ రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాలో చరణ్ ఒక్కడే కాకుండా మరో స్టార్ హీరో తారక్ కూడా ఉండటంతో ఇది మల్టీస్టారర్ మూవీగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు స్టార్ డైరెక్టర్ రాజమౌళి రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్టును రెడీ చేస్తున్నాడు.సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.
ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు.ఈ సినిమాను పూర్తి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ పూజా హెగ్డేను హీరోయిన్గా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.అయితే ఈ సినిమాలో పూజాతో పాటు మరో హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో విలన్ పాత్రలో ఓ బాలీవుడ్ స్టార్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.అయితే విలన్ భార్య పాత్రలో నటించేందుకు మిల్కీ బ్యూటీ తమన్నాను చిత్ర యూనిట్ అప్రోచ్ అయ్యిందట.
నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాలో నటించేందుకు తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ సినిమాలో నార్త్, సౌత్ ఇండస్ట్రీల నుండి చాలా మంది యాక్టర్స్ నటిస్తుండటంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా ఉండనుంది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పీక్స్కు చేరుకున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy