కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన..!!

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది.ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్( Balmoor Venkat ) పేర్లను వెల్లడించింది.

ఈ మేరకు ఇద్దరి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది.దీంతో పార్టీ నేత అద్దంకి దయాకర్ కు మరోసారి నిరాశే ఎదురైంది.కాగా గత ఎన్నికల్లోనూ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ భంగపడిన సంగతి తెలిసిందే.

తాజాగా చివరి వరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి పేరు వినిపించినా ఆయన స్థానంలో పార్టీ అధిష్టానం మహేశ్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ) పేరును ప్రకటించింది.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు