అంజన్న దీక్ష స్వాముల అన్నదానం

మిగిలిన అన్నప్రసాదాలు యువచైతన్య దీపం ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం అనాంతపల్లి గ్రామంలో శివాంజనేయ పుణ్యక్షేత్రం లో శ్రీ ఆంజనేయస్వామి వారి సన్నిధి లో హనుమాన్ పెద్ద జయంతి పురస్కరించుకుని హనుమాన్ మిత్రమండలి ఆద్వర్యంలో శుక్రవారం రోజున ప్రత్యేక పూజలు జరిపించి,అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాములు జాగిరి హరీష్,యామ నరేష్,మద్దిరాల మహేష్, ద్యాగల తిరుపతి,గ్రామ పెద్దలు,మహిళలు,అంజన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి, రామాంజనేయ స్వామి వారి కృపకు పాత్రులైనారు.

మిగిలిన అన్నప్రసాదాలు నిరుపేదలకు పంపీణీ అనంతపల్లి గ్రామంలో హనుమాన్ మిత్ర మండలి బృందం వారు హనుమాన్ దేవాలయo వద్ద ఏర్పాటుచేసిన భోజనం భారీ ఎత్తున మిగలడం జరిగింది కాగా యువచైతన్య దీపం ఫౌండేషన్ కు ఫోన్ చేయడంతో ఫౌండేషన్ సభ్యులు అనంతపల్లి గ్రామానికి చేరుకొని మిగిలిన భోజనాలను తీసుకెళ్ళి వేములవాడ పట్టణ బైపాస్ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది.

అధికారి వేధింపులు పంచాయతీ కార్యదర్శి ఆత్మ హత్య యత్నం

Latest Rajanna Sircilla News