వైరల్ వీడియో... గ్రౌండ్ లో గేల్ చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా

భారత దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఎంతటిదో మనం ప్రత్యేకంగా చర్చించుకోనక్కరలేదు.

క్రికెట్ ను ఒక మతంగా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసే నైజం మన సొంతం.

వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్కుల వారు క్రికెట్ ను ఎంజాయ్ చేస్తారు.ముఖ్యంగా ఐపీఎల్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ కి ఇక పండగే అని చెప్పవచ్చు.

అప్పటి దాకా ఒక్కటిగా క్రికెట్ ను సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ ఐపీఎల్ ప్రాంచైజీ టీంలకు సపోర్ట్ చేయడం.వాళ్ళను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ వార్ ఇలా ఒక ఐపీఎల్ ముగిసే వరకు ఒక సందడిగా ఉంటుంది.

అంతేకాక గ్రౌండ్ లో విధ్వంసక తీరులో చెలరేగిపోయే క్రికెటర్ లు, మ్యాచ్ లేని సమయాల్లో రకరకాలుగా ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంటారు.ఇక మ్యాచ్ సమయంలో గ్రౌండ్ లో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ నెటిజన్లకు, ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తాయి.

Advertisement

తాజాగా క్రిస్ గేల్ గ్రౌండ్ లో చేసిన ఓ పని నెట్టింట్లో వైరల్ గా మారింది.మామూలుగా క్రిస్ గేల్ ఫీల్డింగ్ లో అంతగా ఆకట్టుకోడనే విషయం మనకు తెలిసిందే.

తాజాగా కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో జాంటీ రోడ్స్ తరహాలో బంతిని నిలువరించాడు.ఇక నెటిజన్లే కాదు, స్టాండ్స్ లో కూర్చున్న గేల్ వెస్టిండీస్ టీం మేట్ రస్సెల్ సైతం పగలబడి నవ్వడం జరిగింది.

ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు