నెటిజన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అనసూయ...ఏమందంటే?

యాంకర్, నటి అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.

తన అంద చందాలతో కుర్రకారు మతి పోగొడుతూ రకరకాల షోలతో బుల్లితెరను ఏలుతోంది యాంకర్ అనసూయ.

అయితే బుల్లితెర మీద యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు అందుకోవడమే కాకుండా వెండితెర మీద కూడా తన నటనతో అదృష్టాన్ని పరీక్షించుకుంది.రంగస్థలంలో రంగమ్మత్త గా పాత్ర పోషించి తనలోని నటిని ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుంది.

అయితే ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో కుర్ర కారుని మత్తులో ముంచుతోంది.ఐతే ఇప్పటికే తరచు ఐటమ్ సాంగ్స్ లో నటిస్తున్న అనసూయ ఈ మధ్య ఇకపై ఐటమ్ సాంగ్స్ చేయను.

నటనా ప్రాధాన్యత గల పాత్రలను పోషించడానికే ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించింది.అయితే తాజాగా చావు కబురు చల్లగా సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించడంతో నెటిజన్ అనసూయకు ఓ ప్రశ్న విసిరాడు.

Advertisement

అయితే సినిమాలోని నటీనటులు కాకుండా వేరే నటులు వచ్చి డ్యాన్స్ చేస్తే దానిని స్పెషల్ సాంగ్స్ అంటారని, దానికి ఇప్పుడు ఐటమ్ సాంగ్ అని పేరు పెట్టారని అనసూయ ఘాటు రిప్లై ఇచ్చింది.అయితే అతనికి అనసూయ ఇచ్చిన కౌంటర్ కు అనసూయని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

అతనికి తగిన బుద్ధి చెప్పావని కామెంట్స్ చేస్తూ వార్తను వైరల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు