జబర్దస్త్ తెరపైకి హీరోయిన్... యాంకర్ కి ఎక్కడో కాలుతుందిగా....

ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కామెడీ షో టిఆర్పి రేటింగులు పరంగా దూసుకుపోతోంది.అంతేగాక ఇప్పటికే దాదాపుగా జబర్దస్త్ షో ఫాన్స్ ప్రతి గురు శుక్రవారాల్లో 9:30 అయితే చాలు టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తున్నారు.

అంతలా కట్టిపడేసింది జబర్దస్త్ షో.అయితే తాజాగా వచ్చే వారం ప్రోమోని షో నిర్వాహకులు యూట్యూబ్ లో విడుదల చేశారు.ఎప్పుడు అనసూయతో డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చే హైపర్ ఆది ఈసారి నచ్చావులే హీరోయిన్ మాధవీలతతో డ్యూయెట్ వేసుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు.

దీంతో అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది.అంతేకాక వారిద్దరూ డ్యూయెట్ సాంగ్లో ఉన్నప్పుడు ఇంక చాలు ఆపండి అంటూ సెటైర్లు వేసింది.దీనికితోడు జబర్దస్త్ జడ్జి రోజా అనసూయ ఉద్దేశించి పరోక్షంగా కొందరికి ఎక్కడో కాల్తుందని కౌంటర్ ఇచ్చారు.

దీంతో ఆది కూడా ఈవిడ చేయదు ఇంకొకరిని మనతో చేయనివ్వదు అంటూ పంచులు పేల్చాడు.మొత్తానికి ఈ వారం కూడా హైపర్ ఆది తన పంచులతో కడుపుబ్బా నవించెదనుకు గట్టిగానే రెడీ అయినట్లున్నాడు.

అయితే ఇదంతా స్కిట్ లో భాగంగా కామెడీ లాగానే చేస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం ఎప్పటిలాగే హైపర్ ఆది-అనసూయ వద్ద ఏదో నడుస్తుందని అభిప్రాయపడుతున్నారు.కానీ ఇప్పటికే పలు సందర్భాల్లో హైపర్ ఆది అనసూయ అంటే తనకు ఎంతో గౌరవమని కేవలం కామెడీ పరంగా మాత్రమే ఇలా నటిస్తామని అంతే తప్ప ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు