హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు.

దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది.అయితే నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ఆయన తండ్రిని బీజేపీ నేత కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గం పరిధిలోని సీనియర్ నేతలను కలుస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారని తెలుస్తోంది.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు