పుష్ప రిలీజ్ డేట్‌ పుకార్లకు క్లారిటీ వచ్చినట్లేగా..!

అల్లు అర్జున్‌ అల వైకుంఠ పురంలో సినిమా తర్వాత చేస్తున్న సినిమా పుష్ప.

సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో ఈ సినిమా ప్రకటన వచ్చి దాదాపు గా రెండు ఏళ్లు అవుతుంది.

కరోనా కారణంగా దాదాపు ఏడాది పాటు ఈ సినిమా ఆగి పోయి మళ్లీ ప్రారంభం అయ్యింది.ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్న కారణంగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా ను ఆగస్టులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా మేకర్స్‌ చెప్పారు.అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా పుష్ప సినిమా షూటింగ్‌ అనుకున్నంత స్పీడ్‌ గా అనుకున్న సమయంకు అవ్వడం లేదని అందుకే సినిమా విడుదల విషయమై కాస్త అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో పుష్ప టీమ్‌ ట్విట్టర్‌ లో స్పందించింది.

Advertisement

ట్విట్టర్ లో పుష్ప అఫిషియల్‌ ట్విట్టర్‌ పేజీలో తగ్గేది లే.అంటూ ట్వీట్‌ చేశారు.దాంతో సినిమా విడుదల వాయిదా విషయం పుకార్లే అని తేలిపోయింది.

సినిమా ను ఆగస్టులో అనుకున్న తేదీకి విడుదల చేయడం పక్కా తగ్గేది లే అన్నట్లుగా ఆ ట్వీట్‌ అర్థం ఉందంటున్నారు.సుకుమార్‌ ఈ సినిమా ను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు.

రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఐటెం గా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అల్లు అర్జున్‌ ఈ సినిమా తో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ కొట్టడం ఖాయం అంటున్నారు.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లతో రంగస్థలం సినిమా ను తీసుకు వచ్చిన సుకుమార్‌ మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా తో రావడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు హిట్‌ అవ్వడంతో ఇది హ్యాట్రిక్‌ అంటూ కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు