ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో రాబోతున్న మేజర్ టీమ్!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు.ఈయన విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

క్షణం, గూఢచారి, ఎవరు వంటి విభిన్న కథలతో కమర్షియల్ హిట్స్ అందుకున్న అడవి శేష్ ఇప్పుడు మేజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.అయితే ఈ సినిమా రియల్ లైఫ్ లో జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతుంది.

ఈ సినిమా మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.ఈయన ముంబై లో జరిగిన తీవ్రవాద దాడుల్లో దేశం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడు.

ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో శోభితా దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాను శశి కిరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాలో శోభితా దూళిపాళ్ల పాత్ర చాలా పవర్ ఫుల్ గా, ఎమోషనల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కిస్తున్నారు.ఈ మధ్యనే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

ఈ సినిమాను జులై 2 న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

రేపు అనగా మార్చి 15 న సాయంత్రం 4 గంటలకు ఉన్ని కృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఒక బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నట్టు అడవి శేష్ తెలిపాడు.మరి రేపు మేజర్ సినిమా నుండి ఎలాంటి అనౌన్స్ మెంట్ వస్తుందో వేచి చూడాలి.అయితే ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తుండడం వల్ల ఈ సినిమాకు హైప్ బాగా వచ్చింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

అందులోనూ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిస్తుండడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు