ప్రేమ లేఖలు రాసి.. రెండు చెంపలు వాచిపోయేలా కొట్టించుకున్న నటి !

చిన్నతనంలో ప్రతి ఒక్కరికి ఇతరులపై వ్యామోహం కలగడం సహజమే, కానీ తెలిసీ తెలియని వయసులో అది ప్రేమ అని కొందరు అనుకుంటారు.

అలా ప్రేమలో పడి ఒకరికొకరు ప్రేమ లేఖలు రాసుకోవడం చేస్తూ ఉంటారు.

ఈ విషయం ఇంట్లో పెద్ద వాళ్ళకి తెలిస్తే మాత్రం వారి పరిస్థితి ఊహకందని విధంగా ఉంటుంది.ఈ తరహాలోనే ఓ నటి తన చిన్నప్పుడు ప్రేమలేఖలు రాసి వాళ్ళ అమ్మ కి దొరికి పోవడంతో, చెంపలు వాచిపోయేలా కొట్టించుకుంది.

ఇంతకీ ఆ నటి ఎవరో? ఏమిటో? ఇక్కడ తెలుసుకుందాం.మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచి.

మెల్లగా తన అడుగులను వెండితెర వైపు వేస్తూ సినీ రంగంలోకి ప్రవేశించి గూడచారి లో తన నటన తీరుతో అందరినీ ఆకట్టుకున్న తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాళ.అడవి శేషు పక్కన గూడచారి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శోభిత ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు నిర్మిస్తున్న మేజర్ సినిమాలో నటిస్తోంది.శోభిత చిన్నప్పుడు చదువుపై ఎంత శ్రద్ధ కలిగి ఉండేది.

Advertisement

తన స్కూల్ చదువుతున్నప్పుడు స్కూల్ కెప్టెన్ మీద చిన్న క్రష్ ఏర్పడింది.దాంతో కెప్టెన్ తనని పట్టించుకునే వాడు కాదని, శోభిత అతనిపై ఎంతో ప్రేమను చూపించి పేజీల కొద్దీ ప్రేమ లేఖలు రాసింది.

మరోవైపు శోభిత కు ఇతర అబ్బాయిల నుంచి కూడా ప్రేమ లేఖలు వచ్చేవని తెలిపారు.ఈ తరహాలోనే ఏదో విషయం లో తన తల్లికి అబద్ధం చెప్పబోయి, తన ప్రేమ లేఖలు విషయం అమ్మకు తెలియడంతో ఒక్కసారిగా తన రెండు చెంపలు ఎర్రగా కందిపోయోలా ఎడాపెడా వాయించేసిందనీ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

సినిమాల్లోకి రాకముందు అందాల పోటీలలో, మోడలింగ్ వైపు ఎంతో ఆసక్తి కనబర్చారు.మిస్ ఇండియా రన్నరప్ గా కూడా నిలిచారు.2014లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ మోడల్ గా అవకాశం దక్కింది.తరువాత పలు ప్రకటనల్లో నటిస్తున్న శోభిత కు అనురాగ్‌ కశ్యప్‌ ‘రమణ్‌ రాఘవ2.0’చిత్రంలో అవకాశం ఇవ్వడంతో అలా అనుకోకుండా సినిమాల్లోకి అడుగు పెట్టారు.తాను ఎన్ని సినిమాలు చేసినా గూడచారి తనకెంతో ప్రత్యేక మంటూ ఓ సందర్భంలో శోభిత ధూళిపాళ తెలియజేశారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు