వారి నుంచి తప్పించుకుని నేను, మా నాన్న పారిపోయి వచ్చామంటున్న అప్సర రాణి...

తెలుగులో ప్రముఖ దర్శకుడు రాహుల్ రాజ్ దర్శకత్వం వహించినటువంటి "4 లెటర్స్" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయ మెంది అంకిత మహారణా.

అయితే ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈ అమ్మడికి సరైన గుర్తింపు రాలేదు.

అయితే ఈ మధ్య కాలంలో అంకిత మహారణా అలియాస్ అప్సర రాణి అంటే దాదాపుగా సినీపరిశ్రమలో అందరూ అందరూ గుర్తు పడుతున్నారు.అయితే తాజాగా అంకిత మహారణా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఇందులో భాగంగా సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు మరియు క్యాస్టింగ్ కౌచ్ విషయం పై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇందులో భాగంగా తాను గతంలో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుని ఇందులో భాగంగా షూటింగులో పాల్గొనేందుకు తన తండ్రితో కలిసి బెంగళూరుకు వెళ్లానని, కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం తనని ఒంటరిగా రమ్మన్నారని దాంతో విషయం అర్థమై వెంటనే అక్కడి నుంచి తన తండ్రితో కలిసి పారిపోయి వచ్చేసానని తెలిపింది.

తెలుగు సినీ పరిశ్రమ మాత్రం ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కో లేదని చెప్పుకొచ్చింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అంకిత మహారణా తెలుగులో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నటువంటి "థ్రిల్లర్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ హాట్ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలను షేర్ చేస్తూ బాగానే ప్రోమోట్ చేసుకుంటున్నాడు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు