సర్కారు వారి పాటతో ఆచార్య సేమ్ టు సేమ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది.కాగా ఈ సినిమా కథ సామాజిక అంశానికి సంబంధించిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ సినిమా కథలో దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల గురించి మనకు తెలుపనున్నారు.మంచి సందేశంతో రాబోయే ఈ సినిమాలో చిరు వాటిని ప్రస్తావించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా దాదాపు ఇలాంటి కథతోనే వస్తోంది.ఈ సినిమాలో ఆర్థిక నేరాల ప్రస్తావన ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Advertisement

దీంతో ఈ రెండు సినిమాలు కూడా ప్రజా సమస్యను ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి సందేశాన్ని కూడా అందించేందుకు రెడీ అయ్యాయి.కాగా సర్కారు వారి పాట చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది.

ఇక ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు