సర్కారు వారి పాటతో ఆచార్య సేమ్ టు సేమ్
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్లో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది.
కాగా ఈ సినిమా కథ సామాజిక అంశానికి సంబంధించిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ సినిమా కథలో దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల గురించి మనకు తెలుపనున్నారు.
మంచి సందేశంతో రాబోయే ఈ సినిమాలో చిరు వాటిని ప్రస్తావించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
కాగా మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా దాదాపు ఇలాంటి కథతోనే వస్తోంది.
ఈ సినిమాలో ఆర్థిక నేరాల ప్రస్తావన ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది.దీంతో ఈ రెండు సినిమాలు కూడా ప్రజా సమస్యను ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సందేశాన్ని కూడా అందించేందుకు రెడీ అయ్యాయి.
కాగా సర్కారు వారి పాట చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించనుంది.
ఇక ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.
ఇదేందయ్యా ఇది.. ఎప్పుడు చూడలే.. మన సాంప్రదాయాలు ట్రెండీగా మారిపోయాయో..