లిక్కర్ స్కాంలో కోర్టు ఎదుటకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్..!!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ తాజాగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఎంపీ అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

అయితే ఇవాళ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.ఈ క్రమంలో ఆయనను అధికారులు కస్టడీకి కోరే అవకాశం ఉంది.

మరోవైపు సంజయ్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.నిన్న సాయంత్రం సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్ట్ చేయగా రాత్రంతా ఆయన ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు.

అటు సంజయ్ సింగ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ఆప్ నేతలు బీజేపీ కార్యాలయం వద్ద నిరసన చేసేందుకు సిద్ధం అవుతున్నాయని తెలుస్తోంది.ఈ మేరకు ఆమ్ ఆద్మీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు.

Advertisement
పుష్ప 2 లో అసలైన ట్విస్ట్ ఇదే...అదిరిపోయిందిగా...

తాజా వార్తలు