మహేష్ కి ముగ్గురు కావాలంట

సూపర్ స్టార్ మహేష్ బాబు - ఏఆర్ మురుగదాస్ సినిమాకి దాదాపు కాస్ట్ ఆండ్ క్రూ అంతా ఫిక్స్ అయిపోయింది.

హారీస్ జయరాజ్ సంగీతం,సంతోష్ శివన్ ఫోటోగ్రాఫి ఎప్పుడో ఖరారు కాగా, హీరోయిన్ల వేట ఇన్నాళ్ళు కొనసాగింది.

చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలించి, చివరకి పరణీతి చోప్రాని ఫైనలైజ్ చేశారు.కీర్తి సురేష్ ని హీరోయిన్ గా అనుకున్నారని, ఆ తరువాత కాదనుకోని తీసేశారనే వార్తలో సగం నిజం,సగం అబద్ధం ఉన్నట్లు తెలుస్తోంది.

నిజం ఎంటంటే .కీర్తి సురేష్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారు.అబద్ధం ఏంటంటే .కీర్తిని ఈ ప్రాజెక్టు లోంచి తీసెయ్యడం.కీర్తిని ఇంకా ఈ ప్రాజెక్టు లోంచి తీసెయ్యలేదు.

మరో విశేషమేమిటంటే సాయి పల్లవిని ఈ సినిమాలో అనుకోవడం కూడా రూమర్ కాదు.కీర్తి,సాయి పల్లవి .ఈ ఇద్దరికి స్పెషల్ రోల్స్ ఉన్నాయట.అలాగని ఈ ఇద్దరు ఇంకా కన్ఫర్మ్ కూడా కాలేదండోయ్.

Advertisement

ప్రస్తుతానికి పరిణీతిని మాత్రమే ఫైనల్ చేశారు.ఆ స్పెషల్ రోల్స్ కోసం కీర్తి,సాయి పల్లవిలనే ఉంచేస్తారా లేక ఇంకెవరినైనా తీసుకుంటారా అనేది తెలియరాలేదు.

తెలుగు,తమిళ భాషల్లో ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఇదే నేలలో ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు