మరో ముహూర్తం ఫిక్స్‌

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ సినిమా పూర్తి అవ్వగానే సుకుమార్‌ దర్శకత్వంలో నటించాల్సి ఉంది.

కాని ఎప్పటిలాగే సుకుమార్‌ ఈ సినిమాను కూడా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నాడు.

ఇప్పటికే సగానికిపైగా షూటింగ్‌ పూర్తి కావాల్సిన ఈ సినిమాను ఇంకా ప్రారంభించనే లేదు.ముందుగా అనుకున్న దాని ప్రకారం మార్చిలో ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది.

ఆ తర్వాత ఏప్రిల్‌కు చిత్రీకరణ ప్రారంభోత్సవం వాయిదా వేశారు.ఆ తర్వాత మే చివరి వారంలో తప్పకుండా ఈ సినిమాను ప్రారంభిస్తామంటూ దర్శకుడు సుకుమార్‌ గట్టిగా చెప్పాడు.

అయితే మే కూడా పూర్తి అవ్వబోతుంది.దాంతో మేలో కూడా ఈ సినిమా లేదని తేలిపోయింది.

Advertisement

తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్‌ 15న ప్రారంభించాలని సుకుమార్‌ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లుగా సన్నిహితులకు చెబుతున్నాడు.

జూన్‌ 15న లండన్‌లో చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారు.ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేయడం జరిగింది.

ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా పూర్తి అయ్యాయి.ఈ సినిమాను బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు.‘1’ సినిమా తర్వాత సుకుమార్‌ తెరకెక్కిస్తున్న సినిమా అవ్వడంతో స్క్రిప్ట్‌పై ఒకటి రెండు సార్లు ఫోకస్‌ పెడుతున్నారు.ఈ సినిమాకు ‘ప్రేమతో నాన్నకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు