చాన్నాళ్ల తర్వాత రజినీ..!

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు తమిళంలో ఎంత క్రేజ్‌ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో ఉంది.

తెలుగులో కూడా రజినీకాంత్‌ డబ్బింగ్‌ సినిమాలు సూపర్‌ కలెక్షన్స్‌ను రాబడుతాయి.

రజినీ ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్బింగ్‌ అవ్వడం పరిపాటి.పలు కారణాల వల్ల రజినీకాంత్‌ తెలుగులో చాలా కాలంగా నటించింది లేదు.

‘పెదరాయుడు’ సినిమా తర్వాత రజినీకాంత్‌ తెలుగు సినిమాలో కనిపించింది లేదు.అయితే తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు సినిమాలో నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

తమిళ ప్రముఖ నిర్మాత కలైపులి థాను రజినీకాంత్‌తో తెలుగు మరియు తమిళంలో ద్విభాష చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించాడు.గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగా రంజిత్‌ దర్శకత్వంలో రజినీకాంత్‌ హీరోగా తాను ఈ సినిమా నిర్మిస్తున్నట్లుగా నిర్మాత కలైపులి థాను ప్రకటించాడు.

Advertisement

ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ.రజినీ స్థాయిలో ఈ సినిమా ఉంటుంది.

ఇప్పటి వరకు మా బ్యానర్‌లో ఎన్నో సినిమాలు నిర్మించాము.ఇక ఈసినిమాను కూడా భారీగా నిర్మిస్తామని చెప్పుకొచ్చాడు.

రంజిత్‌ దర్శకత్వంపై పూర్తి నమ్మకం ఉందని, ఆయన రజినీని కొత్తగా ప్రజెంట్‌ చేస్తాడని తాను నమ్ముతున్నట్లుగా పేర్కొన్నాడు.చాలా కాలం తర్వాత తెలుగులో రజినీకాంత్‌ సినిమా చేస్తుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈసినిమాను అతి త్వరలో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు